Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్ ఫ్లూ : తెలంగాణ రాష్ట్రంలో మృతుల సంఖ్య 23

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (14:46 IST)
స్వైన్ ఫ్లూ వైరస్ ధాటికి తెలంగాణా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో మృత్యువాతపడిన వారి సంఖ్య 23కు చేరింది. ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మంగళవారం ఉదయం మరో మహిళ ప్రాణాలు విడిచింది.
 
రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం ఏదులాబాద్‌కు చెందిన వివాహిత శైలజ మంగళవారం ఉదయం చనిపోయింది. స్వైన్ ఫ్లూ బారినపడిన ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. శైలజ మరణంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాలు 23కు చేరుకున్నాయి. 
 
మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ లక్షణాలతో 1050 మందికి పరీక్షలు చేయగా, వారిలో 366 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది. ఇదిలా ఉండగా సోమవారం ఒక్క రోజునే 52 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ సోకినట్లు తెలిసింది. వారిలో ఐదుగురు వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments