కమిషనర్‌ని ఆపిన కానిస్టేబుల్.. రూ. 500 బహుమానం

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (15:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. 
 
ఇంగ్లిష్ పరీక్షకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలలో భాగంగా ఎల్బీనగర్‌లోని పరీక్షా కేంద్రాన్ని డీఎస్ చౌహాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ చౌహాన్ పరీక్షా కేంద్రానికి వెళ్తూ వెళ్తూ చేతిలో ఫోన్ పట్టుకెళ్లారు. 
 
ఈ సమయంలో అక్కడ విధుల్లో వున్న మహిళా కానిస్టేబుల్ సీపీని ఆపారు. సీపీ వద్ద వున్న ఫోన్‌ను ఇవ్వాలని.. పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. 
 
దీంతో సీపీ తన చేతిలోని ఫోన్‌ను అప్పగించారు. అంతేగాకుండా.. మహిళా కానిస్టేబుల్ చిత్తశుద్ధి, ఆమె విధుల పట్ల అంకితభావాన్ని గుర్తించి, సీపీ చౌహాన్ ఆమెను సత్కరించారు. తరువాత, అధికారి కల్పన కృషిని మెచ్చుకొని ఆమెకు రూ. 500 బహుమానం అందించారు.
 
తన మునుపటి ఆదేశాలపై, పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్‌లను అనుమతించేది లేదని, పరీక్షా కేంద్రాలలో ఎటువంటి అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments