Webdunia - Bharat's app for daily news and videos

Install App

చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తాం: కేసీఆర్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (18:56 IST)
వచ్చేనెల 23న నిర్వహించే చండీయాగానికి ఏపీ  సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. సీపీఐ నాయకులు సురవరం సుధాకర్‌ రెడ్డి యాగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం తప్పని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
 
తన సొంత ఖర్చుతోనే ఈ చండీయాగాన్ని నిర్వహిస్తానని.. కొందరు ఔత్సాహికులు కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ యాగంలో 4,500 మంది బ్రాహ్మణులు, 1500 మంది రుత్వికులు పాల్గొంటారని కేసీఆర్ వెల్లడించారు. తానొక్కడినే ఈ యాగాన్ని డబ్బు వెచ్చించి నిర్వహించడం కుదరదని.. స్పాన్సర్లు కూడా ఇందులో పాల్గొంటారని చెప్పారు. 
 
ఈ యాగానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు ఫామ్ హౌస్ (హైదరాబాద్ శివారు ఎర్రవెల్లి-మెదక్ జిల్లా)లో ఈ చండీయాగం జరుగనుందని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments