Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్ తీసుకురమ్మని భర్తను పంపింది... ప్రియుడితో కలిసి భార్య..

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (14:35 IST)
పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఓ భార్య హతమార్చిన ఘటన  మహబూబ్‌బాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని తెలిసి.. ఆ భార్య  ఈ  దారుణానికి ఒడిగట్టింది. గత నెల 21న మహబూబాబాద్ జిల్లాలోని రేగడితండాలో జరిగిన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
ఇన్నారపు నవీన్-శాంతి దంపతులు మంగలికాలనీలో నివాసం వుంటున్నారు. శాంతి రెండున్నరేళ్లుగా వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం  కొనసాగిస్తోంది. విషయం తెలిసిన నవీన్ భార్యను మందలించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి శాంతి ప్లాన్ చేసింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా  గత  నెల 21న రేగడితండాలోని తన పుట్టింటికి వెళ్లి మటన్ తీసుకురావాల్సిందిగా భర్తను పురమాయించింది. భార్య ప్లాన్ తెలియని భర్త స్కూటీపై రేగడితండా బయలుదేరాడు. దారిలో కాపుకాసిన శాంతి ప్రియుడు వెంకటేశ్, అతడి స్నేహితుడు పద్దం నవీన్‌లు నవీన్‌పై దాడిచేసి, ఇనుప రాడ్డుతో తలపై మోది హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు స్కూటీని అతడిపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు.
 
నవీన్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి సేకరించిన మద్యం సీసాలపై ఉన్న బార్‌కోడ్, భార్య సెల్‌ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments