Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమిస్తారు.. పెళ్లి చేసుకుంటారు.. పరాయి వ్యక్తి కోసం చంపేస్తున్నారు..

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (16:22 IST)
వివాహేతర సంబంధాలతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. పరాయి వ్యక్తితో సుఖం కోసం కొందరు కట్టుకున్నవారినే కడతేర్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట శివారు కొత్తకుంటలో ఇలాంటి దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లాడిన భర్తనే ఓ మహిళ ప్రియుడితో కలిసి చంపేసింది. 
 
తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి ఊపిరి ఆడకుండా చేసి కడతేర్చింది. తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు తన భర్త కనపడడం లేదని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ కసాయి భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మద్దూర్‌ మండలం హన్మతండాకు చెందిన భూక్యా మోహన్‌(33) దాదాపుగా పన్నెండేళ్ల క్రితం అదే తండాకు చెందిన భూక్యా వినోదను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో వారు కుటుంబ పోషణ కోసం సిద్దిపేటకు వలస వచ్చారు. మోహన్‌ ఓ హోటల్‌లో పని చేసేవాడు. అతడి భార్య నిర్మాణ పనులకు కూలీగా వెళ్లేది. అక్కడ రాజు అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. 
 
అయితే వారు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మోహన్‌ను చంపాలని ప్లాన్ చేశారు. దీంతో నవంబరు 10న మోహన్‌కు వారిద్దరు కలిసి బాగా మద్యం తాగించారు. అనంతరం మరుసటి రోజు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మోహన్‌ను బైక్ పై ఎల్లారెడ్డిపేట శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడ మోహన్‌కు ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. 
 
అనంతరం శవాన్ని కొత్తకుంటలో పడేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందుతులు వినోద, రాజు అని తేలడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments