Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటెల రాజేందర్ దారెటు, కేసీఆర్ వైరి వర్గాన్ని కలుస్తూ బిజీబిజీగా...?

Webdunia
బుధవారం, 12 మే 2021 (22:53 IST)
తెలంగాణ మాజీ వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పొమ్మనకుండా పొగపెట్టారు టిఆర్ఎస్ పార్టీ నేతలు. ఏకంగా మంత్రి పదవి నుంచి తొలగించేశారు. భూకబ్జా వ్యవహారం ఈటెల మెడకు చుట్టుకోవడంతో అవినీతి మంత్రులు తన కేబినెట్లో ఉండకూడదని కెసిఆర్, కెటిఆర్ కలిసి తొలగించారు.
 
ఈటెలను తొలగించడంతో ప్రధాన పాత్ర కెటిఆర్‌దేనన్న ప్రచారం బాగానే సాగింది. తెలంగాణా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈటెలను పక్కా ప్రణాళికలతో తొలగించారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈటెల ఏ పార్టీలోకి వెళతారన్నది ఆశక్తిగా మారుతోంది.
 
మొదటగా రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్‌ను కలిశారు ఈటెల. వీరిద్దరి మధ్య గంటన్నరకి పైగా చర్చ జరిగింది. చాలా గోప్యంగా వీరిద్దరు కలిశారు. ఆ తరువాత బిజెపి ఎంపి అరవింద్‌ను కలిశారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న నేతలందరినీ వరుసగా కలుస్తున్నారు ఈటెల.
 
అయితే తెలంగాణా రాష్ట్రంలో టిఆర్ఎస్ తరువాత ఆ స్థాయిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని.. కాబట్టి ఆ పార్టీలోకి రావాలని నేతలను ఒత్తిడి తెస్తుంటే బిజెపి లాంటి జాతీయ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనలో ఈటెల ఉన్నారట. ఈటెల సన్నిహితులు కూడా అదే చెబుతున్నారట. మరి చూడాలి ఈటెల రాజేందర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments