Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం: బండి సంజయ్‌

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (07:57 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే పేరు మార్చి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

2023లో రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్‌ అన్నారు. మేం అధికారంలోకి రాగానే యూపీ తరహాలో జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తామని, కేసీఆర్‌కు దమ్ముంటే ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

సంజయ్ ఓ డమ్మీ:జగ్గారెడ్డి
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ డమ్మీ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. "నీకు దమ్ముంటే ప్రధానితో ప్రతి అకౌంట్‌లో 15లక్షలు వేయించు" అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు.

కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయి హుజురాబాద్ ఉపఎన్నికలు వాయిదా వేసుకున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక, పీసీసీ కమిటీ సభ్యులందరూ కలిసి రాహుల్‌ను కలవాలని మొదటి రోజే అనుకున్నామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments