Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయ్: ఐఎండీహెచ్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:19 IST)
తెలంగాణలో వారం రోజులుగా చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు-నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. 
 
సోమవారం తెల్లవారుజామున నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సెరిలింగంపల్లిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
 
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) అంచనా ప్రకారం, ఎల్‌బి నగర్, కార్వాన్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, సరూర్‌నగర్‌తో సహా వివిధ ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో రాత్రి ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ నుండి 14 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
 
పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. IMD-H ప్రకారం, రాబోయే ఒక వారం పాటు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
 
తెలంగాణలోని ఇతర జిల్లాలు, ప్రత్యేకించి ఉత్తరాది జిల్లాలు రానున్న వారంలో వేడి రాత్రులను చూడవచ్చు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరగవచ్చని IMD-H తెలియజేసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments