Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ కాంగ్రెస్ ఓటమికి ప్రజలే బాధ్యులు... జానారెడ్డి వింత వాదన

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (14:10 IST)
వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూడటంపై ఆ పార్టీకి చెందిన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జానారెడ్డి వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రజలే బాధ్యులని చెప్పుకొచ్చారు. తెరాస ఏం చేసినా ఆ పార్టీకే పట్టం కడుతుంటే ఏం చేస్తాం... 16 నెలల కాలంలో తెరాస చేసిన తప్పులను ఎత్తిచూపినా వాటిని ప్రజలు పట్టించుకోవడంలేదనీ, కాబట్టి తమ ఓటమికి ప్రజలే బాధ్యత వహించాలన్నారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే తననే ఎందుకు లక్ష్యం చేసుకుంటున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయరాదని ముఖ్యమంత్రి సూచించడం మంచి శకునమని చెప్పిన జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఒకింత నిరాశ చెందారు. మరోవైపు టిపిసీసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పరాజయంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర్నుంచి ఆయన మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఎంతచేసినా ప్రజలు తెరాసకే ఓటు వేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments