Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులో స్టెప్పులు వేస్తూ ఫ్యామిలీతో కలిసి జర్నీ చేసిన సజ్జనార్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (14:29 IST)
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ విధుల్లో చేరిన మరుక్షణం నుంచి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన మార్క్‌తో సమస్యలు ఎలాంటివైనా వాటిని పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేసమయంలో ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆర్టీసీకి సంబంధించి ఎవరైనా ఏదైనా స్పందిస్తే తక్షణం వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల సమస్యలను తెలుకుంటున్నారు. ఇప్పటికే అనేక మార్లు ఆయన బస్సుల్లో ప్రయాణించారు. 
 
తాజాగా మరోమారు ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అయితే, ఈ దఫా మాత్రం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం గమనార్హం. సజ్జనార్ కుటుంబంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. 
 
పైగా, ఈ బస్సులో ఆయన స్టెప్పులు కూడా వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జర్నీ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఆడుతూపాడుతూ కనిపించారు. ఆర్టీసీ బస్సులో సపరివార సమేతంగా బస్సులో ప్రయాణించి అందరి ప్రశంసలు అందుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments