ఆర్టీసీ బస్సులో స్టెప్పులు వేస్తూ ఫ్యామిలీతో కలిసి జర్నీ చేసిన సజ్జనార్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (14:29 IST)
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ విధుల్లో చేరిన మరుక్షణం నుంచి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన మార్క్‌తో సమస్యలు ఎలాంటివైనా వాటిని పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేసమయంలో ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆర్టీసీకి సంబంధించి ఎవరైనా ఏదైనా స్పందిస్తే తక్షణం వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల సమస్యలను తెలుకుంటున్నారు. ఇప్పటికే అనేక మార్లు ఆయన బస్సుల్లో ప్రయాణించారు. 
 
తాజాగా మరోమారు ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అయితే, ఈ దఫా మాత్రం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం గమనార్హం. సజ్జనార్ కుటుంబంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. 
 
పైగా, ఈ బస్సులో ఆయన స్టెప్పులు కూడా వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జర్నీ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఆడుతూపాడుతూ కనిపించారు. ఆర్టీసీ బస్సులో సపరివార సమేతంగా బస్సులో ప్రయాణించి అందరి ప్రశంసలు అందుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments