Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగిత్యాల జిల్లాలో లాక్డౌన్.. నిబంధనలను అతిక్రమిస్తే రూ.1,000 ఫైన్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (13:53 IST)
జగిత్యాల జిల్లాలో కొవిడ్ కేసులు ఇటీవల కాలంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో డిస్ట్రిక్ట్‌లోని కొన్ని విలేజెస్ స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నాయి. వెల్గటూర్ మండలం ఎండపల్లి, మద్దుట్లలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరగడంతో ఆ గ్రామ పెద్దలు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపారు.
 
గొల్లపల్లి మండలం వెలుగుమట్ల విలేజ్‌లోనూ గ్రామ పంచాయతీ పాలక వర్గం లాక్ డౌన్ విధించింది. సదరు గ్రామంలో కొవిడ్ కేసులతో మరణాలు పెరగకముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు.
 
నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.1,000 ఫైన్ విధించనున్నట్లు గ్రామపంచాయతీ పాలక వర్గం తెలిపింది. మొత్తంగా దేశవ్యాప్తంగాను రోజురోజుకూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ముప్పు గురించి కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరిస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు సూచిస్తున్నది. 
 
అయితే, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో కేసులు పెరగడాని కంటే ముందుగానే ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు పెళ్లిళ్లకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నది. అతి తక్కువ మంది అతిథుల మధ్యనే శుభకార్యాలు చేసుకోవాలని సూచిస్తుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments