నాగార్జునసాగర్‌ బీజేపీ అభ్యర్థిగా రాములమ్మ?

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (10:15 IST)
నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిగా సినీనటి, రాములమ్మ విజయశాంతి పేరును బీజేపీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఆమె అభ్యర్థిత్వంపై నల్లగొండ జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేశారు.

సినీగ్లామర్‌తో పాటు కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడుతున్న తీరు పార్టీకి కలిసొస్తుందని వారు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై ప్రత్యేకంగా ఒక అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది డిసెంబరు 7న విజయశాంతి తిరిగి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె అభ్యర్థిత్వంపై క్షేత్రస్థాయి నాయకులు, కేడర్‌ రాష్ట్ర పార్టీకి నివేదించడం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments