తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానంటున్న రాములమ్మ..?

తెలంగాణా రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసి ప్రత్యక్ష ఎన్నికలకు వెళుతున్న తరుణంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్థం కొనసాగుతోంది.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (09:42 IST)
తెలంగాణా రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసి ప్రత్యక్ష ఎన్నికలకు వెళుతున్న తరుణంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్థం కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు టిఆర్ ఎస్ రకరకాల పన్నాగాలను కొనసాగిస్తోంది. 
 
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలను అరెస్టులు చేయించుకుంటూ, వారి ఇళ్ళపై ఐటీ దాడులను టిఆర్ఎస్ ప్రభుత్వం చేయిస్తోందన్న ఆరోపణలు లేకపోలేదు. అంతే కాదు కొంతమంది ఇంటి దారి పట్టిన నేతలను బలవంతంగా తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా వారికి పార్టీ పదవులతో పాటు అధికారం వస్తే నామినేటెడ్ పదవులను ఇచ్చేందుకు సిద్థమని ప్రకటిస్తున్నారు.
 
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కోరిక మేరకు ఏకంగా నటి విజయశాంతి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి సిద్థంగా ఉన్నారు రాములమ్మ. ధర్మక్షేత్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్థంగా ఉన్నారని ప్రకటిస్తున్నారామె. అయితే గత కొన్నినెలలుగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన రాములమ్మ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ముందుకు వెళుతుండడం కొంతమంది నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొంతమంది విజయశాంతిని వ్యతిరేకిస్తుంటే మరికొంతమంది మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని రాములమ్మ ప్రతిచోటా శపథం కూడా చేసేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments