Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీహెచ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య ఫోన్ ... ఆరోగ్యంపై వాకబు

Webdunia
సోమవారం, 12 జులై 2021 (15:31 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ గత కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయనను ఇటీవల టీ పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్ రెడ్డి కూడా వెళ్లి పరామర్శించి వచ్చారు. 
 
ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం వీహెచ్‌కు ఫోన్ చేసిన‌ ఆయ‌న‌ను పరామర్శించారు. ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చికిత్స అందిస్తోన్న‌ వైద్యుల సలహాలను పాటించాల‌ని వీహెచ్‌కు చెప్పారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని వెంక‌య్య నాయుడు ఆకాంక్షించారు. 
 
కాగా, వీహెచ్‌ పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని అన్నారు. వెంక‌య్య నాయుడి పరామర్శతో తనకు తిరిగి ఉత్సాహం వచ్చిందని వీహెచ్ వ్యాఖ్యానించారు. కాగా, కొంత‌ కాలంగా వీహెచ్‌ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గ‌త ఏడాది ఆయ‌నకు క‌రోనా సోక‌గా, ఆ వైర‌స్‌ను జ‌యించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments