Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్విజయ్ వంటివారే పార్టీని నాశనం చేశాడు : టీ ఎంపీ వీహెచ్

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (14:29 IST)
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వంటి నేతలే కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేశారంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే క్రమంలోనే టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
 
ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు చేస్తున్న ధర్నాకు పొన్నాల వెళ్లడమేంటని నిలదీశారు. ఉద్యమమే చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీనే చేయవచ్చు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయ కమిటీ బాధ్యతలు ఏమిటో కూడా అర్థం కావడం లేదని అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతల వ్యవహారశైలితో టీడీపీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదిరిందేమో అన్న సందేహం కార్యకర్తల్లో నెలకొందనే అనుమానం వ్యక్తం చేశారు.
 
ఇదేసమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కూడా వీహెచ్ ఉతికి ఆరేశారు. డిగ్గీలాంటి నేతలు ఢిల్లీ నుంచి వచ్చి పార్టీని చెడగొట్టారని మండిపడ్డారు. దిగ్విజయ్ కేవలం సమస్యలు వింటారే తప్ప... పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోరని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారి వల్ల పార్టీ సర్వనాశనమై పోయిందన్నారు. ఏపీలో పూర్తిగా భూస్థాపితమై పోయిందని ఆయన గుర్తు చేశారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments