Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 25న మీ అప్పు చెల్లిస్తామని చెప్పి కట్టలేక కుటుంబం ఆత్మహత్య

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (12:38 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలానికి చెందిన మల్కపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక, ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నామనే బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
 
ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలను - ఒక కొడుకు, కుమార్తెను గదిలో ఉరి వేశారు. ఆ తర్వాత ఇరువురు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతుల కుమార్తె తన అత్తమామల ఇంటి నుండి తల్లిదండ్రులను చూడటానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
పత్తి సాగులో తమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయని, అప్పులు తీర్చలేకపోయామంటూ రాసిన సూసైడ్ నోటీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల చెప్పిన దాని ప్రకారం, మార్చి 25న అప్పు చెల్లిస్తామని రుణదాతకు వాగ్దానం చేసినట్లు తెలిసింది. అయితే, అదే రోజున కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments