హైదరాబాద్ మేయర్‌కు అరుదైన గౌరవం

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (12:38 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర మేయరుగా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్‌ నేషన్స్‌ ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్లోబల్‌ మేయర్ల సమావేశంలో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. 
 
ప్రపంచంలోని 40 నగరాలకు చెందిన మేయర్లకు మాత్రమే ఈ వెబ్‌ ఆధారిత సదస్సులో పాల్గొనేందుకు అవకాశం ఉంది. భారత్‌ నుంచి హైదరాబాద్‌ మేయర్‌కు మాత్రమే ఆ గౌరవం దక్కింది. శుక్రవారం రాత్రి 8.15 గంటల నుంచి 10.15 గంటల వరకు జరిగే ఈ సదస్సులో వాతావరణంలో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 
 
లాస్‌ ఏంజెల్స్‌ మేయర్‌ ఎరిక్‌ గర్సెట్టి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్‌ ప్రసంగించనున్నారు. వీరితో పాటు యూఎన్‌ హ్యాబిటాట్‌కు చెందిన ఈడీ మైమూనా మహ్మద్‌ షరీఫ్‌తో పాటు మెల్బోర్‌, టోకియో, జకార్త, లియోయోడీజినిరో, ప్యారిస్‌, మిలన్‌, మాంట్రియల్‌, బార్సిలోనా, జోహనస్‌ బర్గ్‌ తదితర ప్రముఖ అంతర్జాతీయ నగరాల మేయర్లు పాల్గొననున్నారు.
 
కాగా, గత యేడాది ఆఖరులో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసిన గద్వాల్ విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ఎన్నికైంది. ఆ తర్వాత ఆమె మేయర్‌గా ఎన్నుకున్నారు. ఈమె తెరాస సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె కావడంతో మేయర్ పదవి వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉందా? రెహ్మాన్‌ను నిలదీసిన కంగనా రనౌత్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు

భారత్ నాకు స్ఫూర్తి - నా దేశం నా గురువు - నా ఇల్లు కూడా : ఏఆర్ రెహ్మాన్

Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్

వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments