Webdunia - Bharat's app for daily news and videos

Install App

23వ తేదీ నుంచి దుబాయ్ విమాన సర్వీసులు

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (05:40 IST)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్‌తో తమ విమాన సర్వీసులను పునరుద్ధరించబోతోన్నట్లు ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ నుంచి భారత్ నుంచి తమ దేశానికి విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. నిజానికి యూఏఈ తీసుకున్న నిర్ణయం ప్రకారం విమాన సర్వీసులపై నిషేధం జులై 6వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.
 
కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో షరతులతో కూడిన ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. తమ దేశానికి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ.. భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలను నడిపించనున్నట్లు దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభం కావడానికి ముందు నాటి పరిస్థితులకు అనుగుణంగా విమాన సర్వీసులు ఉంటాయని హామీ ఇచ్చింది ఎమిరేట్స్.
 
వ్యాలిడ్ రెసిడెన్స్ విసా ఉండి, యూఏఈ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్ల రెండు డోసులను తీసుకున్న ప్రయాణికులకు తాము అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే- ప్రయాణికులు 48 గంటలు ముందుగా తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments