Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లాడ్జిలో కోరిక తీర్చుకుని ఆ తరువాత..?

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (22:45 IST)
రైలులో పరిచయమైన యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాదులో  సంఘటన జరిగింది. నిందితుడితో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
మహారాష్ట్రకు చెందిన ఒక యువతి హైదరాబాద్ లోని గోపాలపురంలో నివాసముంటోంది. ఉద్యోగం వెతుకులాటలో ఉంది. గత వారంరోజుల క్రితం మహారాష్ట్రలోని తన స్వంత గ్రామానికి వెళ్ళి తిరిగి హైదరాబాదుకు రైలులో వెళుతోంది. రైలులో ఒక యువకుడు పరిచయమయ్యాడు. అతని పేరు వివేకానంద. రియల్ ఎస్టేట్ వ్యాపారం.
 
యువతితో పరిచయం పెంచుకున్నాడు. తనకు తెలిసిన స్నేహితులు చాలామంది ఉన్నారని.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇలా వారంరోజుల పాటు ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నారు. నిన్న రాత్రి యువతిని గోపాలపురం సమీపంలోని ఒక లాడ్జీకి రమ్మన్నాడు. అక్కడ తన స్నేహితుడిని తీసుకువస్తానని.. అతను సాఫ్ట్వేర్ కంపెనీ సిఈఓ అని నమ్మించాడు. 
 
ఆ లాడ్జికి వచ్చిన యువతికి తన స్నేహితుడిని పరిచయం చేశాడు. కూల్ డ్రింక్‌లో అప్పటికే మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఇది తెలియని యువతి సేవించింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వివేకానందతో పాటు తన స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. మెళుకువలోకి వచ్చిన యువతి 100కి ఫోన్ చేసింది. పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments