Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో పెను విషాదం - సిలిండర్ పేలి ఇద్దరి మృతి

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (16:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఏసీ సిలిండర్ పేలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న న్యూస్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీ ఏసీ గ్యాస్‌ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో సిలిండర్ ఉన్నట్టుండి పేలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజీ ఓనర్ షేక్ కలీం, అందులో పని చేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్‌స్టోరేజ్ పని చేస్తున్న మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ- రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments