Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో పెను విషాదం - సిలిండర్ పేలి ఇద్దరి మృతి

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (16:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఏసీ సిలిండర్ పేలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ పట్టణంలోని బర్కత్‌పుర కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న న్యూస్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీ ఏసీ గ్యాస్‌ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో సిలిండర్ ఉన్నట్టుండి పేలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజీ ఓనర్ షేక్ కలీం, అందులో పని చేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్‌స్టోరేజ్ పని చేస్తున్న మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments