Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణీకులకు మరో షాక్: పెరిగిన బస్ పాస్ ధరలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (19:21 IST)
ప్రయాణీకులకు మరో షాక్ ఇచ్చింది టీఎస్‌ఆర్టీసీ. బస్ పాస్ ధరలను భారీగా పెంచేసింది.  జనరల్ ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.970 నుంచి రూ.1150కి పెంపునట్లు తెలిపింది. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ ధర రూ.1070 నుంచి రూ.1300 చేసినట్లు వెల్లడించింది. 
 
ఇక మెట్రో డీలక్స్ ధర రూ.1185 నుంచి రూ.1450కి పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ ధర రూ. 1100 నుంచి రూ.1350కి పెంచారు.  
 
పుష్పక్ ఏసీ పాస్ ధర గతంలో రూ.2500 ఉండగా..ప్రస్తుతం రూ.3000‌కు చేరింది. పెరిగిన బస్ పాస్ ధరలు శుక్రవారం నుంచి అమలు అవుతాయని టీఎస్సార్టీసీ వెల్లడించింది.
 
ఇప్పటికే.. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పేరుతో ఛార్జీలను రౌండప్‌ చేశారు. అలాగే  సెస్ పేరిట ఎక్స్​ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచేశారు. తాజాగా బస్సు పాస్ ధరలు కూడా పెరిగిపోయాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments