తెలంగాణలో కొలువుల జాతర... టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, త్వరలోనే ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (13:51 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా, త్వరలోనే ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణలో భవిష్యత్‌లో ఉద్యోగాలకు కొదువలేదన్నారు. త్వరలో 2,500 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. 
 
కాగా, ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో 26 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. డీఎస్సీ నిర్వహణపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే 8 వేల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. గ్రూపు-2 ఉద్యోగాల నియామక అంశం కోర్టు పరిధిలో ఉన్నదన్నారు.
 
రెండు, మూడు రోజుల్లో అటవీశాఖలో రెండు వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇందులో 1,800 బీట్ ఆఫీసర్ల్లు, 200 రేంజ్ ఆఫీసర్ల పోస్టులున్నాయని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారికి బీట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు చక్కటి అవకాశమన్నారు. వైద్య ఆరోగ్యశాఖలోనూ 400 డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో 15వేల ఉద్యోగాల నియామకాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments