Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు... ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 జులై 2021 (12:16 IST)
ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన ఆర్టీసీ బస్సుల నిర్వహణకు ఈ సంఘటన అద్దంపడుతోంది. వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో 40 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తు ప్రాణగండం నుంచి బయటపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద మోత్కూరు ప్రధాన రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి తొర్రూరుకు బయలుదేరింది. 
 
40 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఆకస్మాత్తుగా ఊడిపోయాయి. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి బస్సు వేగాన్ని నియంత్రించడంతో ఘోర ప్రమాదం తప్పింది. 
 
ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments