Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు... ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 జులై 2021 (12:16 IST)
ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన ఆర్టీసీ బస్సుల నిర్వహణకు ఈ సంఘటన అద్దంపడుతోంది. వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో 40 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తు ప్రాణగండం నుంచి బయటపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద మోత్కూరు ప్రధాన రహదారిపై ఓ ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి తొర్రూరుకు బయలుదేరింది. 
 
40 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఆకస్మాత్తుగా ఊడిపోయాయి. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి బస్సు వేగాన్ని నియంత్రించడంతో ఘోర ప్రమాదం తప్పింది. 
 
ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments