Webdunia - Bharat's app for daily news and videos

Install App

లా సెట్ నోటిఫికేషన్ - 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (12:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో న్యాయ విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే లా సెట్‌ నోటిఫికేషన్‌ను జారీ అయింది. మూడు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు ఎంఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ శనివారం రిలీజ్ చేశారు. 
 
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 6 నుంచి జూన్ 6న తేదీ వరకు కొనసాగుతుంది. ఎల్ఎల్‌బీకి ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులు రూ.1000 చొప్పున దరఖాస్తు ఫీజును చెల్లించాల్సివుంటుంది. ఈ పరీక్షలు జూన్ 21, 22 తేదీల్లో నిర్వహిస్తారు. ఎల్ఎల్బీలో ప్రవేశానికి డిగ్రీ లేదా ఇంటర్ జనరల్, బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు 45, 42, 40 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. 
 
2022-23 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, మహాత్మా గాంధీ వీసీ ప్రొఫెసర్ గోపాలరెడ్డి, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రనివాస రావు, లా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీవీ రెడ్డిలు ఈ నోటిఫికేషన్‌ను చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం లాసెట్ వెబ్ సైట్‌ను పరిశీలించవచ్చు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments