టీఎస్ ఎంసెట్‌–2022 నోటిఫికేషన్‌- మార్చి 14న విడుదల?

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (11:45 IST)
టీఎస్ ఎంసెట్‌–2022 నోటిఫికేషన్‌ మార్చి 14వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సోమవారం దీనిపై సమీక్షా సమావేశం జరిగింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌–2022 నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 
 
ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు హాజరయ్యే సెట్‌లు, జేఈఈ, ఇతర జాతీయ పోటీ పరీక్షలను టీసీఎస్‌ పరిశీలించి.. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసేందుకుగానూ ఎంసెట్ తేదీలను ఖరారు చేయడంపై కసరత్తులు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 
 
ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యే వీలుందని, అనంతరం ఎంసెట్‌ తేదీలను ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపుతామని అధికారులు చెప్పారు. కాగా మే నెలలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తవుతాయి. 
 
అదే నెలలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలూ ఉంటాయి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఎంసెట్‌ సన్నద్ధతకు విద్యార్థులకు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్‌ చివరి వారంలో ఎంసెట్‌ నిర్వహణకు అనుకూలంగా ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments