తెరాసకు రాజీనామా చేసిన కె. రాజయ్య యాదవ్ - సీఎం కేసీఆర్ మాట తప్పారు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (09:57 IST)
తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి 22 యేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న కన్నెబోయిన రాజయ్య యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒకప్పటి గౌరవ మర్యాదలు దక్కడం లేదంటూ ఆవేదన చెందుతూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, తీవ్రమైన మనోవేదన, బాధతోనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
 
ఇదే అంశంపై ఆయన హనుమకొండలో విలేకరులతో మాట్లాడుతూ, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కీసీఆర్‌‍పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఒకప్పటి గౌరవ మర్యాదలు లేవన్నారు. కేసీఆర్ కష్టసుఖాల్లో తాను పాలుపంచుకున్నానని, 22 యేళ్లపాటు ఉద్యమంలో ఆయనతో పాటు అడుగులోఅడుగు వేశానని గుర్తుచేశారు. 
 
ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆరోపించారు. ఉద్యమం కోసం పోరాడిన సొంత పార్టీ నేతలను విస్మరించడమే కాకుండా వారు వృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments