Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసకు రాజీనామా చేసిన కె. రాజయ్య యాదవ్ - సీఎం కేసీఆర్ మాట తప్పారు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (09:57 IST)
తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి 22 యేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న కన్నెబోయిన రాజయ్య యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒకప్పటి గౌరవ మర్యాదలు దక్కడం లేదంటూ ఆవేదన చెందుతూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, తీవ్రమైన మనోవేదన, బాధతోనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
 
ఇదే అంశంపై ఆయన హనుమకొండలో విలేకరులతో మాట్లాడుతూ, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కీసీఆర్‌‍పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఒకప్పటి గౌరవ మర్యాదలు లేవన్నారు. కేసీఆర్ కష్టసుఖాల్లో తాను పాలుపంచుకున్నానని, 22 యేళ్లపాటు ఉద్యమంలో ఆయనతో పాటు అడుగులోఅడుగు వేశానని గుర్తుచేశారు. 
 
ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆరోపించారు. ఉద్యమం కోసం పోరాడిన సొంత పార్టీ నేతలను విస్మరించడమే కాకుండా వారు వృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments