Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి వరిధాన్యం కొనుగోలు పంచాయతీ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (13:09 IST)
వరిధాన్యం కొనుగోలు పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరింది. ఈ విషయంపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు హస్తినకు వెళ్లనున్నారు తెలంగాణ మంత్రులు. ప్రధానితో సహా పలువురు కేంద్రమంత్రుల అప్పాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 
 
ఇప్పటికే సగం కేబినెట్‌, ఢిల్లీకి చేరుకోగా.. మరికొందరు మంత్రులు కూడా అక్కడికి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో మకాం వేసిన తెలంగాణ కేబినెట్ వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతోంది.  
 
ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన హామీకి ఇవ్వాలని కోరనున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేంద్రంపైఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు తమ నిరసన తెలుపగా.. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా నిరసనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. 
 
ఈ మేరకు నేడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెరాస నిరసనలు చేయనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.ో

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments