బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసిన తెరాస ఎమ్మెల్సీ కవిత

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (14:38 IST)
ఇటీవల ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో తన పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలపై తెరాస ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా కోర్టుల్లో ఆమె ఈ పరువు నష్టం దావా పిటిషన్లను దాఖలు చేశారు. 
 
తన తండ్రిని బద్నాం చేయడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందార్ సింగ్‌లు సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై చేసిన ఆరోపణలు సంచలనమై చర్చనీయాంశంగా మారాయి. 
 
వీటిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తన తండ్రి కేసీఆర్‌ను బద్నాం చేయడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వీరిపై పరువునష్టం దావా వేస్తానని నిన్న ప్రకటించారు. 
 
చెప్పిన విధంగానే వీరిపై ఆమె పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టులలో ఆమె పరువునష్టం దావా వేశారు. మరోవైపు సోమవారం కవిత ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టిన 29 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ నరేందర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments