Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలు కూల్చేస్తాం : తెరాస ఎమ్మెల్యే

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2015 (09:24 IST)
పాఠ్యపుస్తకాల నుంచి తెలంగాణ చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఇదే అంశంపై పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో మార్పులను సూచిస్తూ జారీ అయిన జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఏపీ జారీ చేసిన సర్క్యులర్‌పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోని పక్షంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర అవసరం లేదని అనడం సరికాదని ఆయన సూచించారు. తొలగించిన పాఠ్యాంశాలన్నీ ఏపీ సిలబస్‌లో చేర్చాలని ఆయన స్పష్టం చేశారు. 
 
లేనిపక్షంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న సీమాంధ్రుల చరిత్రకారులకు చెందిన విగ్రహాలతో పాటు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీమాంధ్రుల పేర్లను తొలగిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments