Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లు చేతులు విరగ్గొట్టేస్తాం : తెరాస ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:54 IST)
తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న బహింగ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్‌ రెడ్డి అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే కాళ్లు, చేతులు నరికి పంపిస్తామని జోగురామన్న హెచ్చరించారు. 
 
ఇటీవల ఇంద్రవల్లి దళిత దండోరా సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభపై జోగు రామన్న మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా ఇంద్రవెల్లి సభ జరిగిందన్నారు. 
 
ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పగటి దొంగ రేవంత్‌కు తగిన శాస్తి జరిగే రోజు ముందే ఉందని జోగురామన్న ఆరోపించారు.
 
దళిత, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. నాగోబా జాతరకు నిధులిచ్చి ఘనంగా నిర్వహిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు. గతంలో గిరిజన, ఆదివాసీ పండగలను సంస్కృతిని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు వచ్చి గొప్పలు చెప్పుకుంటోందని జోగురామన్న విమర్శించారు. 
 
పోడు భూముల సమస్య పరిష్కారం కరోనా వల్ల కొంత ఆగిందన్నారు. దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని.. త్వరలోనే అవి పరిష్కారమవుతాయి అని తెలిపారు. దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు వెలుగునిచ్చింది, ఇచ్చేది కేసీఆర్ మాత్రమే అని జోగు రామన్న పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments