Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ కుటుంబానికి కేసీఆర్ బహుమతి .. ఎమ్మెల్యీ అభ్యర్థిగా సురభి

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (08:52 IST)
మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహా రావు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ బహుమతి ఇచ్చారు. పీవీ నరసింహా రావు శతజయంతి వేడుకలు జరుపుకుంటున్న వేళ.. పీవీ కుమార్తెల్లో ఒకరైన ప్రముఖ చిత్రకారిణి, విద్యావేత్త సురభి వాణీదేవిని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థినిగా ప్రకటించారు. ఈమె హైదరాబాద్ ‌- రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించారు. 
 
సోమవారం హైదరాబాద్‌లో ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో టీఆర్‌ఎస్‌ విజయావకాశాలు మరింత పెరిగాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పీవీకి జనాదరణ ఉన్న నేపథ్యాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. 
 
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి గతంలో జరిగిన అవమానాలు, అన్యాయాన్ని దిద్దుకునేందుకు ఇదొక మంచి అవకాశమని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాణీదేవి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా వంగర గ్రామం. ఆమె విద్యాభ్యాసం, వృత్తిజీవితం మొత్తం హైదరాబాద్‌ కేంద్రంగానే సాగింది. 
 
1986లో జేఎన్టీయూ నుంచి డిప్లొమా ఇన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో పట్టాపొందారు. విద్యావేత్తగా, చిత్రకారిణిగా, సంఘ సేవకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉన్నది. 35 ఏండ్లుగా వందల పెయింటింగ్స్‌ వేసిన వాణీదేవి.. తన పెయింటింగ్స్‌తో ఇప్పటివరకు 15 ఎగ్జిబిషన్లు నిర్వహించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌-డీసీలో ఉన్న గాంధీ మెమోరియల్‌ సెంటర్‌లో ‘సారే జహాసె అచ్ఛా’ పేరుతో ఎగ్జిబిషన్‌ నిర్వహించి రికార్డు సృష్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments