Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరం వేడుకలు : హైదరాబాద్‌ నగరంలో కఠిన ఆంక్షలు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (15:17 IST)
కొత్త సంవత్సర వేడుకలను నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ మేరకు మూడు పోలీస్ స్టేషన్ పరిధిల్లో ఈ ఆంక్షలు అమలుకానున్నాయి. డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి ఒకటో తేదీ ఉదయం 5 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. 
 
ఈ ఆంక్షల్లో భాగంగా, సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, మైడ్ స్పేస్, ఫోరం మాలో - జేఎన్టీయూ, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, బీజేఆర్, బేగంపేట, ప్యారడైజ్, ప్యాట్నీ, తెలుగు తల్లి, నారాయణగూడ, బషీర్ బాగ్, ఎల్బీ నగర్, మలక్‌పేట, నెక్లెస్ రోడ్డు, మెహిదీపట్నం, పంజాగుట్ట ఫ్లై ఓవర్లతో పాటు.. వీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ను పోలీసులు మూసివేయనున్నారు. 
 
పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వే పైకి టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. అలాగే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు‌పైకి కేవలం లారీలు, సరకుల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణ టిక్కెట్లు ఉన్నవారికి మాత్రం ఓఆర్ఆర్‌పై వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. క్యాబ్ డ్రైవర్లు విధిగా యూనిఫాం ధరించడంతో పాటు.. వాహనం, డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి ఖచ్చితంగా అన్ని ఒరిజినల్స్ తమ వద్ద ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments