Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌లో కలకలం - కోమటిరెడ్డి ఇంటికి రేవంత్.. తెరాసతో పొత్తుపై క్లారిటీ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:56 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తనకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టలేదని గుర్రుగా ఉన్న అసంతృప్తి నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం వెళ్లారు. వీరిద్దరూ భేటీ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపించిది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను కోమటిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. 
 
"రేవంత్ రెడ్డి ఈ రోజు మా ఇంటికి వచ్చారు. ఆయనను సాదరంగా స్వాగతించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఇరువురం చర్చించాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మేం మార్పు తీసుకునిరాగలమని భావిస్తున్నాం" అని ట్వీట్ చేశారు.
 
కాగా, గతంలో టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్‌ పదవిని రేవంత్‌కు కట్టబెట్టింది. అప్పటి నుంచి కోమటిరెడ్డి తన పంథాలో నడుస్తూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒక దశలో ఆయన తెరాసలో కూడా చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. అలాంటి కోమిటిరెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఇపుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

విష్ణు మంచు కన్నప్పలో కాజల్ అగర్వాల్

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments