కాంగ్రెస్‌లో కలకలం - కోమటిరెడ్డి ఇంటికి రేవంత్.. తెరాసతో పొత్తుపై క్లారిటీ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:56 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తనకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టలేదని గుర్రుగా ఉన్న అసంతృప్తి నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం వెళ్లారు. వీరిద్దరూ భేటీ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపించిది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను కోమటిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. 
 
"రేవంత్ రెడ్డి ఈ రోజు మా ఇంటికి వచ్చారు. ఆయనను సాదరంగా స్వాగతించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఇరువురం చర్చించాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మేం మార్పు తీసుకునిరాగలమని భావిస్తున్నాం" అని ట్వీట్ చేశారు.
 
కాగా, గతంలో టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్‌ పదవిని రేవంత్‌కు కట్టబెట్టింది. అప్పటి నుంచి కోమటిరెడ్డి తన పంథాలో నడుస్తూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒక దశలో ఆయన తెరాసలో కూడా చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. అలాంటి కోమిటిరెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఇపుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments