Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌లో కలకలం - కోమటిరెడ్డి ఇంటికి రేవంత్.. తెరాసతో పొత్తుపై క్లారిటీ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:56 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తనకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టలేదని గుర్రుగా ఉన్న అసంతృప్తి నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం వెళ్లారు. వీరిద్దరూ భేటీ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపించిది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను కోమటిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. 
 
"రేవంత్ రెడ్డి ఈ రోజు మా ఇంటికి వచ్చారు. ఆయనను సాదరంగా స్వాగతించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఇరువురం చర్చించాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో మేం మార్పు తీసుకునిరాగలమని భావిస్తున్నాం" అని ట్వీట్ చేశారు.
 
కాగా, గతంలో టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్‌ పదవిని రేవంత్‌కు కట్టబెట్టింది. అప్పటి నుంచి కోమటిరెడ్డి తన పంథాలో నడుస్తూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒక దశలో ఆయన తెరాసలో కూడా చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. అలాంటి కోమిటిరెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఇపుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Robo Shankar: తమిళ నటుడు రోబో శంకర్ కన్నుమూత.. అసలేమైంది?

ఓజీ లేటెస్ట్ అప్‌డేట్... ప్రకాశ్ రాజ్ పోస్టర్ రిలీజ్

Vedika: హీరోయిన్ వేదిక అందమైన బీచ్ వైబ్ స్టిల్స్ తో అభ్యర్థిస్తోంది

Upendra : ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి ఉపేంద్ర స్పెషల్ పోస్టర్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. దహనం చుట్టూ వివాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

హైదరాబాద్‌లో సిగ్నేచర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న జోస్ అలుక్కాస్

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments