బీజేపీ తరపున పోటీ చేస్తానంటున్న నటి రేష్మా రాథోడ్

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (11:14 IST)
భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ నటి రేష్మా రాథోడ్ వ్యాఖ్యానిస్తోంది. ఈమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. 
 
ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చిలుకూరి రమేష్‌ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ వాటిని అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆమె ఆరోపించారు. 
 
పార్టీ ఆదేశిస్తే వైరా నియోజకవర్గంనుంచి తాను పోటీచేస్తానని తెలిపారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెరాస ప్రభుత్వం సహకరించకుండా దానిని మెదక్‌కు తరలించాలని చూసిందని ఆరోపించారు. 
 
బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments