మీకు క్లాసులు తీసుకుంటా అంటూ స్కూలు ఫీజులపై గళమెత్తిన నటుడు

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (14:00 IST)
కరోనా కష్టకాలంలోనూ పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతులు, పరీక్షల నిర్వహణ పేరుతో నిర్బంధ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూలు యజమాన్యం తీరుపై టాలీవుడ్ నటుడు శివబాలాజీ గళమెత్తారు. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా ఈ పాఠశాల యాజమాన్యం బలవంతంగా ఫీజులు వసూలు చేస్తోందంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని, గవర్నమెంట్ ఆదేశాలను బేఖాతర్ చేస్తోందని ఆరోపించారు. ఫీజు వసూలు కోసం అనవసర పరీక్షలు కూడా నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. 
 
ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్ చేస్తుందని, ఎదురు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, 'మీరు పిల్లలకు క్లాసులు తీసుకోవడం కాదు, నేను మీకు క్లాసులు తీసుకుంటా' అంటూ శివబాలాజీ ఘాటుగా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments