ఇవాళ విశాఖ ఉక్కు అన్నారు, రేపు సింగరేణి అంటారు: కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (19:34 IST)
ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నాం అంటున్నారు, ఇలాగే చూస్తూ వూరుకుంటే రేపు సింగరేణిని కూడా ప్రైవేటీకరిస్తాం అంటారు అని కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆయన మాట్లాడుతూ... మన దేశానికి సంబంధించిన సమస్యలపై స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మేము మొదట భారతీయులం, ఆ తరువాత తెలంగాణ బిడ్డలం. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలపై మా ప్రభుత్వం మాట్లాడకుంటే, భవిష్యత్తులో తెలంగాణ కోసం ఎవరు మాట్లాడతారు," అని మంత్రి కెటి రామారావు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
 
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నందుకు కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్‌డిఎ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం భవిష్యత్తులో సింగరేణిని కూడా ప్రైవేటీకరిస్తుందని ఆరోపించారు. ఎల్‌పిజి ధరల పెంపుపై 2003లో ప్రధానమంత్రి మోడీ, మన్మోహన్ సింగ్‌ను విమర్శించారు. ఇప్పుడు బిజెపికి ఓటు వేస్తే, ఇంధన ధరల పెంపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు అంగీకరిస్తున్నారని స్పష్టమవుతుందని ఆయన అన్నారు.
 
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, ఈ ఏడాది జనవరిలో 35,000 మంది ఉద్యోగులను పదోన్నతి కల్పించామని మంత్రి చెప్పారు. న్యాయవాదుల కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. వాట్సాప్ విశ్వవిద్యాలయంలో బిజెపి నాయకులు చదువుకున్నారని ఆయన ఎగతాళి చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన తరువాత ప్రతిపక్షాలు మౌనంగా ఉండిపోయాయని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments