పాముకాటుకు గురై మూడేళ్ల చిన్నారి మృతి

Webdunia
శనివారం, 29 జులై 2023 (17:06 IST)
మూడేళ్ల చిన్నారి పాముకాటుకు గురైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలకో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవీపేట మండలం బినోలకు చెందిన మంగళి భూమయ్య, హర్షిత దంపతులు. వీరికి కుమారుడు రుద్రాన్ష్‌ (3), మూడు నెలల కుమార్తె ఉన్నారు. 
 
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంట్లో ఉన్న ఓ గది కూలిపోయింది. దీంతో భూమయ్య కుటుంబం శుక్రవారం పక్కనున్న మరో గదిలో నిద్రించారు. గాఢనిద్రలో ఉండగా.. రెండు పాములు వచ్చి రుద్రాన్ష్‌ను కాటు వేశాయి.  బాలుడు నిద్రలోనే గట్టిగా ఏడవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై నిద్రలేచారు.  
 
బాలుడికి సమీపంలో రెండు పాములు వెళ్లటాన్ని భూమయ్య గమనించాడు. వెంటనే వాటిని కర్రతో కొట్టి చంపాడు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చిన్నారి ఇవాళ మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments