Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముకాటుకు గురై మూడేళ్ల చిన్నారి మృతి

Webdunia
శనివారం, 29 జులై 2023 (17:06 IST)
మూడేళ్ల చిన్నారి పాముకాటుకు గురైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలకో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవీపేట మండలం బినోలకు చెందిన మంగళి భూమయ్య, హర్షిత దంపతులు. వీరికి కుమారుడు రుద్రాన్ష్‌ (3), మూడు నెలల కుమార్తె ఉన్నారు. 
 
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంట్లో ఉన్న ఓ గది కూలిపోయింది. దీంతో భూమయ్య కుటుంబం శుక్రవారం పక్కనున్న మరో గదిలో నిద్రించారు. గాఢనిద్రలో ఉండగా.. రెండు పాములు వచ్చి రుద్రాన్ష్‌ను కాటు వేశాయి.  బాలుడు నిద్రలోనే గట్టిగా ఏడవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై నిద్రలేచారు.  
 
బాలుడికి సమీపంలో రెండు పాములు వెళ్లటాన్ని భూమయ్య గమనించాడు. వెంటనే వాటిని కర్రతో కొట్టి చంపాడు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చిన్నారి ఇవాళ మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments