Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా-నాన్నా నాకు పెళ్ళి చేయరూ అంటూ అడిగిన యువతి: చంపేసిన తల్లిదండ్రులు

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (17:00 IST)
కన్నతల్లిదండ్రులే ఆ యువతి పాలిట కసాయిలుగా మారారు. పెళ్ళి చేసి కట్నం ఇవ్వాల్సి వస్తుందనే కారణంగా 32 ఏళ్ల కన్నబిడ్డను బండరాళ్ళతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. తోడబుట్టిన అన్న కూడా తల్లిదండ్రులకు సహకరించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
 
మునుగోడు మండలం వెలగలగూడెం గ్రామానికి చెందిన తీర్పారి బుచ్చయ్య, లక్ష్మమ్మ దంపతులకు గోవర్ధన్, కవిత అనే ఇద్దరు పిల్లలున్నారు. కవిత ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. తల్లిదండ్రులు కవిత పెళ్ళి చేయమని కూమారుడు గోవర్ధన్‌ను కోరుతున్నప్పటికీ అతను నిరాకరిస్తూ వచ్చేవాడు.
 
ఇదే విషయంపై కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీనితో కవిత పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులతో పాటు యువతి అన్నకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. అయితే తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు, అన్న ముగ్గురు కలిసి నిద్రిస్తున్న కవితను బండరాయితో కొట్టి చంపేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కూతురిని చంపేశారని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయాన్ని ఒప్పుకుని లొంగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments