అమ్మా-నాన్నా నాకు పెళ్ళి చేయరూ అంటూ అడిగిన యువతి: చంపేసిన తల్లిదండ్రులు

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (17:00 IST)
కన్నతల్లిదండ్రులే ఆ యువతి పాలిట కసాయిలుగా మారారు. పెళ్ళి చేసి కట్నం ఇవ్వాల్సి వస్తుందనే కారణంగా 32 ఏళ్ల కన్నబిడ్డను బండరాళ్ళతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. తోడబుట్టిన అన్న కూడా తల్లిదండ్రులకు సహకరించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
 
మునుగోడు మండలం వెలగలగూడెం గ్రామానికి చెందిన తీర్పారి బుచ్చయ్య, లక్ష్మమ్మ దంపతులకు గోవర్ధన్, కవిత అనే ఇద్దరు పిల్లలున్నారు. కవిత ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. తల్లిదండ్రులు కవిత పెళ్ళి చేయమని కూమారుడు గోవర్ధన్‌ను కోరుతున్నప్పటికీ అతను నిరాకరిస్తూ వచ్చేవాడు.
 
ఇదే విషయంపై కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీనితో కవిత పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులతో పాటు యువతి అన్నకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. అయితే తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు, అన్న ముగ్గురు కలిసి నిద్రిస్తున్న కవితను బండరాయితో కొట్టి చంపేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కూతురిని చంపేశారని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయాన్ని ఒప్పుకుని లొంగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments