Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా-నాన్నా నాకు పెళ్ళి చేయరూ అంటూ అడిగిన యువతి: చంపేసిన తల్లిదండ్రులు

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (17:00 IST)
కన్నతల్లిదండ్రులే ఆ యువతి పాలిట కసాయిలుగా మారారు. పెళ్ళి చేసి కట్నం ఇవ్వాల్సి వస్తుందనే కారణంగా 32 ఏళ్ల కన్నబిడ్డను బండరాళ్ళతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. తోడబుట్టిన అన్న కూడా తల్లిదండ్రులకు సహకరించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
 
మునుగోడు మండలం వెలగలగూడెం గ్రామానికి చెందిన తీర్పారి బుచ్చయ్య, లక్ష్మమ్మ దంపతులకు గోవర్ధన్, కవిత అనే ఇద్దరు పిల్లలున్నారు. కవిత ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. తల్లిదండ్రులు కవిత పెళ్ళి చేయమని కూమారుడు గోవర్ధన్‌ను కోరుతున్నప్పటికీ అతను నిరాకరిస్తూ వచ్చేవాడు.
 
ఇదే విషయంపై కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీనితో కవిత పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులతో పాటు యువతి అన్నకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. అయితే తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ కోపంతో ఊగిపోయిన తల్లిదండ్రులు, అన్న ముగ్గురు కలిసి నిద్రిస్తున్న కవితను బండరాయితో కొట్టి చంపేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కూతురిని చంపేశారని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయాన్ని ఒప్పుకుని లొంగిపోయారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments