Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మల్ దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (05:14 IST)
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జోనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు చెరువులో గల్లంతయ్యారు.

ఒకరు క్షేమంగా బయటపడినా... మరొకరి ఆచూకీ లభించలేదు. దసరా పర్వదినాన నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడకు చెందిన ఇద్దరు యువకులు స్థానిక వినాయక సాగర్ చెరువులో దిగి గల్లంతయ్యారు.

గమనించిన స్థానికులు ఒకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో యువకుడు అనిల్ వర్మ(20) చెరువులో మునిగి పోయాడు. స్థానికులు ఎంత వెతికినా దొరకలేదు. స్థానికుల పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

పండగపూట చెరువులో యువకుడు గల్లంతు కావడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు వినాయక సాగర్ వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments