Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేసి మేనమామను పెండ్లి చేసుకోవాలని తల్లి ఒత్తిడి

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:47 IST)
హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సాయినాథపురానికి చెందిన  ఆమె కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందేమోనని అందరూ భావించారు. అయితే నెరెడ్మెట్ పోలీసులకు అనుమానం వచ్చి విచారణ జరపగా ఒక సూసైడ్ నోట్ లభించడంతో విషయం బయటకు వచ్చింది.
 
మృతిరాలి తల్లి రాములమ్మ అతని మేనమామ పుల్లారావు వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం మృతిరాలి భర్తను చంపేసి మేనమామ అయినటువంటి పుల్లారావును వివాహం చేసుకోవాలని నిందితులు ఇద్దరు కలిసి మృతురాలిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.
 
భర్తను చంపడానికి పొలాలకు వాడే పురుగులమందును కూడా అందించారు. అమాయకుడైన భర్తను చంపడం ఇష్టం లేక వీరి ఒత్తిడి తట్టుకోలేక చివరకు అదే పురుగుల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు తన అమ్మ, మేనమామే కారణమంటూ సూసైడ్ నోట్ వ్రాసి మరీ చనిపోయింది. పోలీసులు నిందితులను ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments