Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేసి మేనమామను పెండ్లి చేసుకోవాలని తల్లి ఒత్తిడి

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:47 IST)
హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సాయినాథపురానికి చెందిన  ఆమె కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందేమోనని అందరూ భావించారు. అయితే నెరెడ్మెట్ పోలీసులకు అనుమానం వచ్చి విచారణ జరపగా ఒక సూసైడ్ నోట్ లభించడంతో విషయం బయటకు వచ్చింది.
 
మృతిరాలి తల్లి రాములమ్మ అతని మేనమామ పుల్లారావు వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం మృతిరాలి భర్తను చంపేసి మేనమామ అయినటువంటి పుల్లారావును వివాహం చేసుకోవాలని నిందితులు ఇద్దరు కలిసి మృతురాలిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు.
 
భర్తను చంపడానికి పొలాలకు వాడే పురుగులమందును కూడా అందించారు. అమాయకుడైన భర్తను చంపడం ఇష్టం లేక వీరి ఒత్తిడి తట్టుకోలేక చివరకు అదే పురుగుల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు తన అమ్మ, మేనమామే కారణమంటూ సూసైడ్ నోట్ వ్రాసి మరీ చనిపోయింది. పోలీసులు నిందితులను ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments