Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ కారణాలతో కేంద్రం వివక్ష చూపుతోంది: కేటీఆర్

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (07:43 IST)
భాగ్యనగరం కొన్ని దశాబ్దాలుగా రక్షణ రంగ అభివృద్ధిలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. కేంద్రం చిన్న చూపు చూస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్లో జరిగిన 3వ డిఫెన్స్ కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. రక్షణ రంగాల అభివృద్ధి... ఆయా రంగాలకు సంబంధించిన కొత్త సంస్థల వ్యవస్థాపనలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు, రాజకీయ పార్టీల లబ్దికి అతీతంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరిగిన 3వ డిఫెన్స్ కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం తీరును ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదన్న ఆయన.. డిఫెన్స్ రంగానికి సంబంధించి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ... కేంద్రం మాత్రం నాగ్పూర్, గుజరాత్ వంటి ప్రాంతాలకే ప్రాముఖ్యత ఇస్తోందంటూ విమర్శించారు.

భాగ్యనగరంలో గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఉందన్న ఆయన.. ఇక్కడ డిఫెన్స్ రంగ వృద్ధికి కావాల్సిన అన్ని రకాల మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైన కేంద్రం.. ఆయా అంశాలను పరిశీలించి డిఫిన్స్ సంస్థల ఏర్పాటులో నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments