Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్ష హాలులో మహిళ.. ఏడుస్తున్న పాప.. పోలీసులు ఏం చేశారంటే?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (12:38 IST)
జోగుళాంబ గద్వాల్ జిల్లా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రూప్-1 పరీక్షల కోసం ఆరు నెలల పాపాయితో వచ్చిందో మహిళ. కానీ ఆ మహిళ పరీక్ష రాస్తుండగా.. పాపాయి ఏడవటం మొదలెట్టింది. ఆపై ఏం జరిగిందంటే... పూర్తి వివరాలు.. జోగుళాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని గంజిపెట్ సరస్వతి స్కూల్ కు ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన లక్ష్మి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు తన 6 నెలల చిన్నారిని తీసుకొని భర్త దినకర్ తో వచ్చి పరీక్ష రాయడానికి లోపలికి వెళ్లగా గంట తరువాత చిన్నారి ఏడ్వటం మొదలు పెట్టింది. తండ్రి ఎంత లాలించిన ఏడుపు ఆపలేదు. దీంతో తండ్రి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తన భార్య లక్ష్మి నీ బయటకు పిలవండని అక్కడి పోలీస్ సిబ్బందికి తెలిపాడు.
 
అయితే.. ఈ విధంగా మధ్యలో పిలువకూడదని చెప్పడంతో భార్యను పిలవండి వెళ్ళిపోతామని అధికారులతో చెప్పాడు. దీంతో పరీక్ష రాసే మహిళను బయటికి రానీయకుండానే.. ఆమెను డిస్టబ్ చేయకుండా అక్కడి పోలీస్ అధికారులు, సిబ్బంది పాప తండ్రికి నచ్చజెప్పి పోలీస్ కానిస్టేబుల్ రజనీకాంత్ ఆ పాపను తీసుకొని సాగర్ చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఏడుపు మాన్పించి ఎగ్జామ్ పూర్తి అయ్యేవరకు పాపను లాలిస్తూ అనంతరం పాప తల్లికి అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments