Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నిలిచిపోయిన వారి వివరాలు తెలపండి- సీఎస్‌

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:20 IST)
లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో నిలిచిపోయిన వారిని తరలించేందుకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో వారిని ఏ విధంగా వారి వారిస్వస్థలాలకు పంపాలన్న విషయం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈమేరకు రాష్ట్రంలో నిలిచిపోయిన వారి వివరాలను తెలపాల్సిందిగా ఆయా రాష్ర్టాల చీఫ్‌సెక్రటరీలకు లేఖ రాసినట్టు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ ప్రక్రియనుపూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకనోడల్‌ అధారిటీని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి సందీప్‌కుమార్‌ సుల్తానియాను నోడల్‌ అఽధికారిగా నియమించారు.

తెలంగాణలో నిలిచిపోయిన వారిని, వారి రాష్ర్టాలకు తరలించడానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని  ఆయా రాష్ర్టాలను కోరినట్టు సోమేశ్‌కుమార్‌ వివరించారు. అవసరమైన ఏర్పాట్ల కోసం తమ రాష్ర్టాలకు సంబంధించిన నోడల్‌ అధికారులను తెలంగాణ నోడల్‌ అథారిటీతో సంప్రదించాలని అన్నారు.

తెలంగాణలో నిలిచిపోయిన వారికి అవసరమైన స్ర్కీనింగ్‌ను నిర్వహించి వైరస్‌ లక్షణాలు లేని వారికి ప్రయాణం కోసం పాసులను తెలంగాణ నోడల్‌ అథారిటీ జారీ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయి తమ రాష్ర్టాలకు వెళ్లాలనుకున్న వారికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments