Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో శుభసూచకం.. అయినా మే 7 వరకు లాక్‌డౌన్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (10:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గతంలో రోజుకు 50కి పైగా నమోదు కాగా, ఇపుడు కేవలం పది లేదా పదిలోపు మాత్రమే నమోదవుతున్నాయి. అందువల్ల త్వరలోనే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లాక్‌డౌన్‌కు ముందు.. లాక్‌డౌన్ తర్వాత అని పోల్చుకుంటే. లాక్‌డౌన్ కాలంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. అయనప్పటికీ.. మే ఏడో తేదీ వరకు ఏ ఒక్కరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, కరోనా వైరస్ చివరి లింకు వరకు పరీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ప్రస్తుతం తెలంగాణాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్యం 1003గా ఉండగా, 332 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 646 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అంతేకాకుండా, ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 10 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. 
 
అంతేకాకుండా, సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికే పాజిటివ్‌ వచ్చిందని.. మంగళవారంనాటికి 21 జిల్లాలు కరోనా యాక్టివ్‌ కేసులు లేని జిల్లాలుగా మారుతున్నాయని ప్రకటించారు. లాక్‌డౌన్‌ అమలుతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగామని, మే ఏడోతేదీ వరకు లాక్‌డౌన్‌ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు.
 
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మనకు శుభసూచకమన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగినపక్షంలో అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments