Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోకలి బండతో భర్త తలపై బాదిన భార్య.. స్పాట్‌లో ప్రాణంపోయింది...

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (08:40 IST)
నిత్యం మద్యం సేవించి వచ్చి చిత్ర హింసలు పెడుతున్నాడని భర్తను ఓ భార్య కొట్టి చంపేసింది. మద్యంమత్తులో ఉన్న భర్త తలపై రోకలి బండతో బలంగా ఒక్క దెబ్బ కొట్టింది. అంతే... ఆ వ్యక్తి అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... వరంగల్‌ జిల్లాకు చెందిన గోవింద్‌ శ్యామ్‌ అలియాస్‌ శ్యాంసుందర్‌ (38), సరోజ (35) మూడేళ్ల క్రితం నాగారం మున్సిపల్‌ పరిధికి వలస వచ్చారు. వాచ్‌మన్‌ డ్యూటీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్యాంసుందర్‌ మద్యానికి బానిస అయ్యాడు. మద్యం మత్తులో సరోజను తిడుతూ, కొడుతూ వేధించేవాడు. 
 
రోజూలాగే శనివారం రాత్రి శ్యాంసుందర్‌ మద్యం తాగి సరోజను కొట్టాడు. భరించలేని సరోజ పక్కనే ఉన్న రోకలిబండతో అతని తలపై గట్టిగా కొట్టింది. శ్యాంసుందర్‌ తలకు తీవ్ర గాయమై స్పృహతప్పి కింద పడిపోయాడు. మందు ఎక్కువై కింద పడిపోయాడని భావించింది సరోజ. ఉదయం నిద్ర లేచిన ఆమె శ్యాంసుందర్‌ను లేపగా అతను చనిపోయి ఉన్నాడు. 
 
దీంతో సరోజ బాపూజీ కాలనీ వాసులకు సమాచారం అందించింది. కాలనీ అధ్యక్షుడు సీఐ నరేందర్‌ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్యాంసుందర్‌, సరోజ దంపతులకు ఒక కూతురు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments