Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 8 నుంచి పదో తరగతి పరీక్షలు.. టైమ్ టేబుల్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (17:04 IST)
కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన పదో తరగతి పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమైంది. ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు, సూచనల మేరకు ఈ పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఇందులోభాగంగా, వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 
 
కరోనా వైరస్‌కు ముందు కేవలం మూడు పరీక్షలు మాత్రమే పూర్తయ్యాయి. మార్చి 19వ తేదీన ఈ పరీక్షలు ప్రారంభంకాగా, ఆ తర్వాత మూడు పరీక్షలు జరిగాయి. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో పరీక్షలను వాయిదావేశారు.
 
ఇపుడు మిగిలిన 8 పరీక్షలకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1, జూన్ 11న ఇంగ్లీష్ పేపర్-2, 14న గణితం పేపర్-1, 17న గణితం పేపర్-2, 20న సైన్స్ పేపర్-1, 23న సైన్స్ పేపర్-2, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 29న సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. 
 
అలాగే, జూలై రెండో తేదీన ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్ (సంస్కృతం అబిక్), జూలై 5వ తేదీన ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ రెండో పేపర్ (సంస్కృతం అబిక్), ఒకేషనల్ కోర్సు థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 వరకు, ఒకేషనల్ థియరీ పేపర్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments