Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ఇచ్చినా కృతజ్ఞత లేకుండా కాంగ్రెస్‌ను చంపేశారు : సర్వే

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (14:41 IST)
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఒక ప్రాంతంలో (సీమాంధ్ర) పార్టీ నష్టపోతుందని తెలిసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కేంద్ర మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ  పట్ల ఏమాత్రం కృతజ్ఞత చూపకుండా తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అసలు కారణమైన 'తల్లి'ని (సోనియాను ఉద్దేశించి) తెలంగాణ ప్రజలు పూర్తిగా మరిచిపోయారన్నారు. అనేక కష్టనష్టాల కోర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఏర్పాటు చేస్తే... కనీస కృతజ్ఞత లేకుండా ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని ఆరోపించారు. 
 
సీమాంధ్రలో పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా... సోనియా తెలంగాణ ఇచ్చారని మెదక్ ఉపఎన్నిక ప్రచారంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా ప్రజలు గుర్తించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments