Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచంగా తీసుకున్న కరెన్సీ నోట్లను గ్యాస్‌స్టౌవ్‌పై వేసి తగులబెట్టిన తెరాస నేత...

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (07:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీకి చెందిన ఓ నేత చేసిన పనికి ప్రతి ఒక్కరూ విస్తుపోయారు. తాను లంచంగా తీసుకున్న రూ.6 లక్షల నోట్ల కట్టలను తగులబెట్టాడు. దీనికి కారణం... ఈ విషయం అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియడమే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల పరిధిలో క్రషర్‌ ఏర్పాటుకు తహసీల్దార్‌ సైదులు ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షలు డిమాండ్ చేశారు. వాటిని మధ్యవర్తిగా ఉన్న మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటాయ గౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దార్‌ సూచించారు. 
 
ఈ క్రమంలో కల్వరుర్తిలోని విద్యానగర్‌లో ఉన్న తన నివాసం వద్ద వెంకటాయగౌడ్‌ నగదును తీసుకున్నాడు. ఇదంతా ఏసీబీ అధికారులు చూస్తున్నారనే విషయాన్ని గ్రహించిన వెంకటాయ గౌడ్‌.. వెంటనే తన ఇంట్లోకి వెళ్లి గ్యాస్ స్టౌవ్‌పై లంచంగా తీసుకున్న రూ.6 లక్షల నగదును కాల్చివేశాడు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని తహసీల్దార్‌ సైదులు నివాసంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments